జమిలీ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

*2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు:ప్రహ్లాద్ జోషి*

*న్యూ ఢిల్లీ:* అక్టోబర్ 19 రిపబ్లిక్ న్యూస్IMG-20241019-WA0006
భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు.కమిటీ కూడా పూర్తీ స్థాయిలో పరిశీలన జరిపి తన నివేదికను కేంద్ర ప్రభుత్వంకు అందజేసింది.జమిలి ఎన్నికలు జరగాలి అంటే రాజ్యాంగంలో 5 ఆర్టికల్స్(ఆర్టికల్ 83,85,172,174,356) లు రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చెయ్యాలని సూచించింది.ఈ బిల్లు ఆక్సెప్ట్ అవ్వాలి అంటే లోక్ సభ,రాజ్య సభ లో 67% మంది సపోర్ట్ చెయ్యాలి.14 రాష్ట్రాలు అసెంబ్లీ లు సపోర్ట్ చెయ్యాలి.అలా మద్దతు ఇస్తే బిల్లు రాజ్యాంగ పరిధిలోకి వస్తుంది.ఈ బిల్లు 2024 ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెoటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది.ఈ బిల్లుకు పార్లమెంట్ లో మద్దతు లభిస్తే 2027 ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశం మొత్తం అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తుంది.ఈ ఎన్నికలు జరిగిన 100 రోజుల తర్వాత మున్సిపల్,గ్రామ పంచాయితి ఎన్నికలు నిర్వహిస్తుంది.దేశం మొత్తం పరిపాలన సౌలభ్యం కొరకు ఈ జమిలి ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

Tags:

Related Posts

Advertisement

Latest News

మున్సిపాలిటీ రహదారి ధ్వంసం మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని...
అనంతపురం జిల్లా కలెక్టర్ గా ఆనంద్
పబ్బతి వేణుగోపాల్ ను సన్మానించిన మంత్రి
సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పర్యవేక్షణ
వెలుగోడు లో ముగిసిన వినాయక నిమజ్జనం వివాదం
ఆత్మకూరులో ఆవు హల్చల్
వెలుగోడు లో గణేష్ ఉత్సవ సమితి భక్తుల ధర్నా