మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ

మంత్రి ఎన్ఎండి ఫరూక్

మున్సిపల్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ

మెనూ పాటించకపోవడంపై ఆగ్రహం 

సమస్యల పరిష్కారానికి డీఈఓకు ఆదేశం

 

నంద్యాల, ఏఫ్రిల్ 2, (రిప‌బ్లిక్ న్యూస్‌): నంద్యాల స్థానిక ఎన్జీవోస్ కాలనీ రోడ్డులోని మున్సిపల్ హైస్కూల్‌ను రాష్ట్ర న్యాయ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యా సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి స్వయంగా భోజనం చేసిన మంత్రి ఫరూక్ , విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఈరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్డు వడ్డించకపోవడాన్ని గమనించిన ఆయన, భోజన నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులకు పోషకాహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాలలోని మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా వస్తున్న నీరు ఉప్పగా ఉండటంతో విద్యార్థులు తాగడానికి ఇబ్బంది పడుతున్నట్లు మంత్రి ఫరూక్ దృష్టికి వచ్చింది. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చాలా కాలంగా స్లాప్ లెవల్‌లో ఆగిపోయిన నిర్మాణ పనుల వల్ల, అక్కడ ఉన్న కట్టెలు ఎప్పుడు పడతాయోనని విద్యార్థులు భయాందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. పాఠశాల రికార్డులు, విద్యార్థులు మరియు సిబ్బంది హాజరు పట్టికలను తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై మంత్రి ఫరూక్ వెంటనే జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడారు. మధ్యాహ్న భోజనంలో లోపాలు, తాగునీరు, భవన నిర్మాణ సమస్యలను వివరించి, యుద్ధ ప్రాతిపదికన వీటిని పరిష్కరించాలని ఆదేశించారు. పాఠశాల తనిఖీ అనంతరం మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థుల కోసం మెరుగైన పోషకాహారాన్ని అందిస్తోందని . మెనూ ప్రకారం గుడ్డు ఇవ్వకపోవడం సరికాదని విద్యార్థులకు పెట్టే భోజనం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. నిర్లక్ష్యం వహించే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్నా విద్యార్థులకు ఉప్పు నీరు రావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం మా బాధ్యత. వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారకూడదని . ఆగిపోయిన స్లాప్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ప్రమాదకరంగా ఉన్న కట్టెలను తొలగించాలని అధికారులను ఆదేశించారు . ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని . విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు, వారికి నాణ్యమైన విద్య అందేలా చూడాలని . జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి పాఠశాలలోని ప్రతి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags: