మున్సిపాలిటీ రహదారి ధ్వంసం
మున్సిపల్ రోడ్డు ధ్వంసం
వైసిపి కౌన్సిలర్ల హస్తం ఉందంటున్న బాధితులు
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వెనక మున్సిపాలిటీకి రోడ్డు కు గిఫ్ట్ డిడ్ గా ఇచ్చిన స్థలాన్ని కొందరు వ్యక్తులు వైసీపీ కౌన్సిలర్ల అండతో స్థలం మాది అంటూ గుంతను తీసి ధ్వంసం చేశారని స్థానికులు శ్రీకాంత్ రెడ్డి వెంకటరామిరెడ్డి సాదిక్ ఫయాజ్ తదితరులు ఆరోపిస్తున్నారు. ధ్వంసం చేసిన ఈ రహదారి చైతన్య స్కూల్ విద్యార్థులు ఎన్నో గృహాలకు రాకపోకలకు వినియోగిస్తున్నారు ఈ రహదారిని ఆటంకం కలిగించడం వలన విద్యార్థులు గృహ యజమానులు మెకానిక్ షెడ్యూలకు ఎంతో ఇబ్బంది ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు
స్థలంపై వివాదం ఉంటే మున్సిపాలిటీకి రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్స్ పై కోర్టుకు వెళ్లి రుజువు చేసుకోవాలి కానీ మున్సిపాలిటీకి రిజిస్టర్ చేసిన రహదారి స్థలాన్ని ఎలా ధ్వంసం చేస్తారని ప్రశ్నిస్తున్నారు దీనిపై మున్సిపల్ కమిషనర్ కు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రహదారిని పునరుద్ధరించాలని కోరారు