ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు గంగ ప్రాజెక్టు చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణాస్వీకారం
On
నంద్యాల అర్బన్ డిసెంబర్ 21, (రిపబ్లిక్ న్యూస్): నంద్యాలలో సాగునీటి సంగం ఎన్నికలలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్ట్ బిసి4 చైర్మన్గా సంజీవ్ కుమార్ రెడ్డి, వైస్ చైర్మన్గా మనోహర్ చౌదరిలు మొదటి ఎన్నికలలోనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శనివారం వారు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడుకు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. రైతులకు సకాలంలో నీటిని అందించి వారి అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. ఏవరైనా అధికారులు వారి విధులలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Tags:
Related Posts
Latest News
02 Jun 2025 11:33:26
లంచం ఇవ్వకపోతే 20 ఏళ్లు జైలు శిక్ష వేయిస్తానని బెదిరింపు.. తాజా కేసుల్లో కాక పాత కేసులో లంచం డిమాండ్.. రూ.80,000 లంచంతో పట్టుబడ్డ హెడ్ కానిస్టేబుల్...